దుమ్ముగూడెం, : మూసేసిన పాఠశాలను తిరిగి తెరిపించారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. సుక్మా జిల్లా గోండ్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్(35) ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం కొందరు మావోయిస్టులు అపహరించారు. సమీప అటవీప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్థులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మూసివేయించారు. అధికారుల సహాయంతో ఇటీవల పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖపాత్ర పోషించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోర్టులో కర్రలతో కొట్టి.. హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.
Also read
- హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
- తల్లి కుట్ర: చిన్న కొడుకుతో పెద్ద కొడుకు హత్యకు ప్లాన్
- తుపాకీతో కాల్చుకుని టీచర్ ఆత్మహత్య
- మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో.. గర్భం దాల్చింది
- కార్పొరేట్ స్కూల్ సూపర్వైజర్ కామ చేష్టలు





