దుమ్ముగూడెం, : మూసేసిన పాఠశాలను తిరిగి తెరిపించారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. సుక్మా జిల్లా గోండ్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్(35) ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం కొందరు మావోయిస్టులు అపహరించారు. సమీప అటవీప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్థులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మూసివేయించారు. అధికారుల సహాయంతో ఇటీవల పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖపాత్ర పోషించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోర్టులో కర్రలతో కొట్టి.. హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





