October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshViral

Jagan: పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా ఇస్తారు?… జగన్ తో చెప్పిన యువతి… వీడియో వైరల్





విజయవాడలో పర్యటించిన జగన్  సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ  సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత  మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.

కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…”మీకు ప్రభుత్వ సాయం అందిందా… ఇంకా అందలేదా?” అని జగన్ ఓ మహిళను అడగ్గా… పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ… “నీళ్లు మెడ వరకు ఉన్నాయి… పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు” అని స్పష్టం చేసింది.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via