విజయవాడలో పర్యటించిన జగన్ సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ అధినేత మెడ వరకు నీళ్లున్నప్పటికీ, కొంతమందికి ఇచ్చారని వెల్లడించిన ఓ యువతి
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్ లో వరద బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు.
కాగా, బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో, ఓ యువతి నిర్మొహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…”మీకు ప్రభుత్వ సాయం అందిందా… ఇంకా అందలేదా?” అని జగన్ ఓ మహిళను అడగ్గా… పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ… “నీళ్లు మెడ వరకు ఉన్నాయి… పాపం, వాళ్లయినా ఎలా ఇస్తారు? అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు” అని స్పష్టం చేసింది.
తాజా వార్తలు చదవండి
- అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు
- రైల్వేకోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి!
- కన్నతల్లి దారుణం- కొడుకు ఆరోగ్యం కోసం కూతురు నరబలి- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
- నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?




