మహబూబాబాద్ : ఓ భార్య.. తన భర్తకు దగ్గరుండి మరో మహిళతో పెళ్లి చేసింది. ఈ విచిత్ర సంఘటన తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గూడూరు గ్రామానికి చెందిన సురేష్, సరితలకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి సంసారం హాయిగానే గడచిపోతుంది. ఈ క్రమంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ, వీరాస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్ని తనకు ఊహ తెలిసినప్పటి నుండే ప్రేమిస్తుంది. ఈ విషయం సురేష్ భార్య సరితకి తెలిసింది. సంధ్య మానసిక వికలాంగురాలు. సంధ్య మనసుని సరిత అర్థం చేసుకుంది. సంధ్యకు, తన భర్తకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. సంధ్యకి, సురేష్కి జరగబోయే పెళ్లికి సరితే బంధువులను ఆహ్వానించింది. బంధువులందరి సమక్షంలో భర్తకు మార్కండేయ దేవాయలంలో రెండో పెళ్లి చేసింది.

భార్యే దగ్గరుండి భర్తకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారందరూ సరితని మెచ్చుకుంటున్నారు. సరిత పెళ్లి చేయడమే కాదండోరు.. సంధ్యది చిన్న పిల్లల మనస్తత్వమని, తనని కూడా పసిపిల్లలానే చూసుకోవాలని భర్తను కోరింది. ప్రస్తుతం ఈ వివాహం ట్రెండింగ్ టాపిక్ అయింది.
తాజా వార్తలు చదవండి
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





