కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగష్టు : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిటుకుల పోచయ్య(38) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.మృతుడు పోచయ్య తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృత్యున్నట్లు మృతుని భార్య పారిజాతం ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్ట్మాస్టర్ నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





