యర్రగొండపాలెం (ప్రకాశం) : యర్రగొండపాలెం పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు. ఆ పాఠశాలలో 600 మంది దాకా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా విద్యార్థులతో 600 చపాతీలను చేయించిన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే ఆదివారం కావడంతో వంటవారికి సాయం చేస్తున్నామని మరికొందరు అంటున్నారు. కాగా ఇలా విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
Also read :
- వసంత నవరాత్రులు స్టార్ట్! ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఇలా చేస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది!
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- బాబోయ్.. వీళ్లది మామూలు పత్తేపారం కాదు..! దండెంపై ఆరేసిన జాకెట్ పొరుగింట్లో ప్రత్యక్షం.. ఏరులై పారిన రక్తం
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి





