యర్రగొండపాలెం (ప్రకాశం) : యర్రగొండపాలెం పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు. ఆ పాఠశాలలో 600 మంది దాకా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా విద్యార్థులతో 600 చపాతీలను చేయించిన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే ఆదివారం కావడంతో వంటవారికి సాయం చేస్తున్నామని మరికొందరు అంటున్నారు. కాగా ఇలా విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
Also read :
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”