తిరుమలలో వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి హల్చల్ చేశారు.

తిరుమల: వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు. శ్రీవారి ఆలయం, పుష్కరిణి వద్ద ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు. సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధుల్లో వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమలలో వారు వ్యవహరించిన తీరుపై పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. “దువ్వాడ శ్రీనివాస్ను త్వరలోనే వివాహం చేసుకుంటాను. వారి సతీమణి విడాకుల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నాను. విడాకులు రాగానే అధికారికంగా వివాహం చేసుకుంటాం” అని తెలిపారు.
Also read
- నేటి జాతకములు.29 ఏప్రిల్, 2026
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.





