యశవంతపుర: బెంగళూరు కొడిగేహళ్లి భద్రప్ప లేఔట్కు చెందిన ఎస్. శోభ (48) అనే మహిళ హత్య మిస్టరీగా మారింది. ఆమె స్థానికంగా ఒక డ్రైవింగ్ స్కూల్ను నడుపుతున్నారు. హర్షిత, సుప్రియ అనే ఇద్దరు కూతుళ్లు ఉండగా వారికి పెళ్లి చేశారు. హర్షితకు ఈ నెల 4వ తేదీన పెళ్లి చేయగా ఆమె నగరంలోనే భర్త ఇంటికి వెళ్లిపోయింది.
శనివారం రాత్రి ఆమెకు హర్షిత ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చి చూడగా తల్లి రక్తపు మడుగులో శవమై ఉంది. దీంతో మరో కూతురు, భర్త వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త భార్య నుంచి విడిపోయి కూతురి ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది. ఇంట్లో బంగారు నగలు, కారు లేవని, ఎవరో తెలిసినవారే ఇంట్లోకి వచ్చినట్లు ఉందని కూతుర్లు చెబుతున్నారు. పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు
Also read
- Venni Karumbeswarar Temple: షుగర్ పేషెంట్లు క్యూ కడుతోన్న శివాలయం.. ఈ ఆలయ రహస్యం ఇదే!
- 2026లో అదృష్ట రాశులు వీరే.. మీ రాశి ఉందో చూసేయండి!
నవ గ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. - Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట
- Kubera Yoga: గురువు అతి వక్రం.. ఆ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది..!
- Nidhivan Mystery: రాత్రి పూట ఆ గుడివైపు వెళ్లిన వారు ఏమవుతున్నారు?.. రంగమహల్ మిస్టరీ ఇదీ!





