మహబూబాబాద్ : ఓ భార్య.. తన భర్తకు దగ్గరుండి మరో మహిళతో పెళ్లి చేసింది. ఈ విచిత్ర సంఘటన తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గూడూరు గ్రామానికి చెందిన సురేష్, సరితలకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరి సంసారం హాయిగానే గడచిపోతుంది. ఈ క్రమంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన పద్మ, వీరాస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్ని తనకు ఊహ తెలిసినప్పటి నుండే ప్రేమిస్తుంది. ఈ విషయం సురేష్ భార్య సరితకి తెలిసింది. సంధ్య మానసిక వికలాంగురాలు. సంధ్య మనసుని సరిత అర్థం చేసుకుంది. సంధ్యకు, తన భర్తకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. సంధ్యకి, సురేష్కి జరగబోయే పెళ్లికి సరితే బంధువులను ఆహ్వానించింది. బంధువులందరి సమక్షంలో భర్తకు మార్కండేయ దేవాయలంలో రెండో పెళ్లి చేసింది.

భార్యే దగ్గరుండి భర్తకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారందరూ సరితని మెచ్చుకుంటున్నారు. సరిత పెళ్లి చేయడమే కాదండోరు.. సంధ్యది చిన్న పిల్లల మనస్తత్వమని, తనని కూడా పసిపిల్లలానే చూసుకోవాలని భర్తను కోరింది. ప్రస్తుతం ఈ వివాహం ట్రెండింగ్ టాపిక్ అయింది.
తాజా వార్తలు చదవండి
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





