వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అత్త అడ్డువస్తుందనే కారణంతో కోడలు ఆమెకు విషం కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చింది. దీంతో చికిత్స పొందుతూ అత్త మరణించడం కలకలం రేపుతోంది. తన తల్లిని భార్య చంపిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పర్వతగిరి మండలం పెద్దతండాలో భూక్య మంజుల, దేవేందర్ దంపతులు నివసిస్తున్నారు.
అయితే పెరుకవాడకు చెందిన సారయ్య అనే వ్యక్తితో.. మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చివరికి ఈ విషయం ఆమె అత్తయ్య భూక్య గమ్మి(55)కి తెలిసింది. దీంతో పలుమార్లు అత్త కోడళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గతంలోనే రెండుసార్లు అత్త తలపై మంజుల గాయం చేసింది. మరోసారి చేయి కూడా విరగ్గొట్టింది. గొడవలు తీవ్రమవ్వడంతో డిసెంబర్ 3న మంజుల తన అత్త గమ్మికి థమ్సప్ కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించేలా చేసింది.
దీంతో కొద్దిసేపటి తర్వాత గమ్మి కిందపడి కొట్టుకుంటోంది. ఆమెను చూసిన కొడుకు దేవేందర్ స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించాడు. డాక్టర్ సూచన మేరకు తొలుత తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మళ్లీ అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం గమ్మి మృతి చెందింది. కొడుకు దేవేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




