వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాజీపేట ఎస్సై లవన్ కుమార్ కథనం ప్రకారం..
కాజీపేట టౌన్, న్యూస్టుడే: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్) విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాజీపేట ఎస్సై లవన్కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నగరం కొత్తపేటకు చెందిన గోపాల్ కుమారుడు హృతిక్ సాయి (22) వరంగల్ నిట్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి బుధవారం నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు క్యాంపస్ సిబ్బంది, మిత్రులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాజీపేట శివారు వడ్డేపల్లి చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గురువారం సాయంత్రం పోలీసులకు సమాచారమిచ్చారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తిగానే పరిగణించిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా అనంతరం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం పలు సామాజిక మాధ్యమాల్లో మృతదేహం, ఇతర వివరాలు పోస్టు చేయడంతో తోటి విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘హృతిక్సాయి కొంతకాలంగా కళాశాల, హాస్టల్లో ముభావంగా ఉంటున్నాడని, తోటి విద్యార్థులతోనూ సరిగా మాట్లాడేవాడు కాదని, మార్కులు తక్కువగా రావడంతో
మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని’ పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Also Read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025