కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు.
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
మరోవైపు యు.కొత్తపల్లి మండలం కొండవరంలో ఓటర్లు రోడ్డెక్కారు. ప్రమాణం చేస్తేనే డబ్బులిస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో ఎదురు తిరిగి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం చేయబోమని తేల్చిచెప్పారు. అభ్యర్థుల నుంచి తమ పేరిట డబ్బు తీసుకుని పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!