మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నగీనా అనే మహిళ తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్.. నగీనా(32) ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాజీ మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడు. ఇవాళ మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





