మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నగీనా అనే మహిళ తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్.. నగీనా(32) ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాజీ మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడు. ఇవాళ మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





