మద్యం మత్తులో తన భార్యను చంపేశాడో భర్త. ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నగీనా అనే మహిళ తన భర్త బాజీతో కలిసి కంసాలిపేటలో నివాసం ఉంటోంది. బాజీ పెయింటర్.. నగీనా(32) ఓ సమోసాల తయారీ కేంద్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాజీ మద్యానికి బానిసై రోజూ భార్యతో గొడవపడేవాడు. ఇవాళ మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే కత్తితో నగీనా గొంతు కోసి చంపేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





