పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్డే పార్టీకి తీసుకెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతుర్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
AP News: పలాసలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన పలాస జిల్లాలో కలకలం రేపింది. 19వ తేదీన పలాస సూదికొండకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను బర్త్డే పార్టీకి ముగ్గురు యువకులు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. మూడో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో మూడో వ్యక్తి ఆ ఇద్దరి అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఈ ఘాతుకంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు బలైయ్యారు. తల్లిదండ్రులు కూతుర్ల భవిష్యత్తు కోసం ఈ దారుణాన్ని దాచి పెట్టారు. చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగోక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
గత ప్రభుత్వం హయాంలో పలాస ప్రతిష్టకు భంగం కలిగిందన మండిపడ్డారు. ఆ సంస్కృతికి చెరమగీతం పాడాలన్నారు. మరోసారి ఆడపిల్ల వైపు చూడాలన్నా, వారిపై దాడులకు పాల్పడాలన్నా భయపడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు నిందితులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





