పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను బర్త్డే పార్టీకి తీసుకెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతుర్ల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
AP News: పలాసలో అమానుషం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన పలాస జిల్లాలో కలకలం రేపింది. 19వ తేదీన పలాస సూదికొండకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను బర్త్డే పార్టీకి ముగ్గురు యువకులు తీసుకువెళ్లారు. అనంతరం ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. మూడో మైనర్ బాలిక ప్రతిఘటించడంతో మూడో వ్యక్తి ఆ ఇద్దరి అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు.
ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు..
ఈ ఘాతుకంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు బలైయ్యారు. తల్లిదండ్రులు కూతుర్ల భవిష్యత్తు కోసం ఈ దారుణాన్ని దాచి పెట్టారు. చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగోక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతుగా నిలిచారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
గత ప్రభుత్వం హయాంలో పలాస ప్రతిష్టకు భంగం కలిగిందన మండిపడ్డారు. ఆ సంస్కృతికి చెరమగీతం పాడాలన్నారు. మరోసారి ఆడపిల్ల వైపు చూడాలన్నా, వారిపై దాడులకు పాల్పడాలన్నా భయపడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు నిందితులను వదిలేది లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





