ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా సీఎం దంపతులు విజయవాడ పటమట అన్న క్యాంటీన్కు వచ్చారు. అక్కడ పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ పర్యటనలో ఒక్కసారిగా అనూహ్య ఘటన జరిగింది. కార్యక్రమం అనంతరం సీఎం బయట మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన సేఫ్టీ టీంలో భాగమైన NSG కమాండో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రమైన ఎండ నేపథ్యంలో సదరు కమాండో వడదెబ్బకు గురైనట్లు సమాచారం.
Also read
- రైఫిల్తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
- నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…
- ఆత్మకు ఆకలి వేస్తుందా..? మాసికాలు ఆత్మ ఆకలి తీరుస్తాయా..? గరుడపురాణం ఏం చెప్తుంది..?
- అనవసర విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి
- లవర్కు మరొకరితో వివాహం జరిగిందన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య





