చిత్తూరు: ఇటుకల బట్టీలో పనికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేయడంతో అవమానంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం పుంగనూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కమతంపల్లి గ్రామానికి చెందిన చెందిన ఆనంద్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె హేమలత (17). బాలిక తన తల్లితో కలిసి అదే గ్రామానికి చెందిన గణేష్తోపాటు ఇటుకల బట్టీలో పనికి వెళ్లింది. ఈ సమయంలో గణేష్ ఆ బాలికపై కన్నేశాడు.
కేకలు వేయడంతో బాలిక తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో నిందితుడు గణేష్ పరారయ్యాడు. ఇలా ఉండగానే బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఇటుకల బట్టీ వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకుంది. వెంటనే తల్లి, గ్రామస్తులు కలసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. బాలిక అప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది
Also read
- ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకోండి!
- Astro Secrets: మీ రాశిని శాసించే ఆ జంతువు ఏంటో మీకు తెలుసా?.. జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలివే!
- Weekly Horoscope: వారికి అదృష్టం కలిసి రానుంది..! 12 రాశులకు వారఫలాలు
- నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను చంపి..
- రైల్వే స్టేషన్కు వెళ్తుండగా విరుచుకుపడ్డ మృత్యువు..భార్య, కొడుకు కళ్లెదుటే భర్త దుర్మరణం! ఏం జరిగిందో చూస్తే..





