ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు మృతి చెందాడు. మృతులు పఠాన్ యూసుఫ్ మియా (65), కుమారుడు కరీముల్లాగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
TG Crime: ఖమ్మం జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో పడిన తండ్రిని కాపాడబోయి కుమారుడు కూడా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బోనకల్లు మండలం ఆళ్లపాడు గ్రామంలో పఠాన్ యూసుఫ్ మియా (65)కి మతిస్థిమితం లేదు. ఇంటి సమీపంలోని ఊర చెరువులోకి దిగాడు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని గమనించిన కుమారుడు కరీముల్లా తండ్రిని కాపాడుదామని చెరువులోకి దిగాడు.
కాపాడే ప్రయత్నం చేసినా..
అయితే గతంలో చెరువులో ప్రోక్లైన్ల ద్వారా పెద్ద పెద్ద గోతులు తీసి మట్టిని తరలించారు. దీంతో లోతును అర్థం చేసుకోలేక కుమారుడు కూడా తండ్రితో పాటే చనిపోయాడు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. తర్వాత తండ్రీ కుమారుల మృతదేహాలను వెలిసి తీశారు. రంజాన్ పర్వదినాన ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యూసుఫ్ మియాకు భార్య ముగ్గురు కొడుకులు. కరీముల్లాకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





