సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఒంగోలు: సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్పాల్ (Vijay paul) ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గతంలో వైసీపీ హయాంలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆయనను విచారిస్తున్నారు.
ఈ కేసులో ఈనెల 13న పోలీసులు విజయ్ పాల్ ను విచారించారు. తనకేమీ తెలియదు.. గుర్తులేదు అంటూ ఆయన అప్పట్లో విచారణాధికారుల ఎదుట చెప్పారు.
మరోవైపు ఈ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పుపై ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ క్రమంలో విజయ్పాల్ నేడు విచారణకు హాజరుకావడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.
Also read
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..





