*పల్నాడుజిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు – వైసీపీ పనేనన్న …ఎన్డీయే కూటమి నియోజకవర్గ అభ్యర్థి.. భాష్యం. ప్రవీణ్*
పల్నాడు జిల్లా
పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం భూషయ్య కాంప్లెక్స్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు.
అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించారు.
వైసీపీ శ్రేణులు మా కార్యాలయానికి నిప్పు అంటించారు. మెున్న జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, తట్టుకోలేక మా కార్యాలయాన్ని తగలబెట్టారు. ఓటమి భయంతోనే మా పార్టీ కార్యలయం తగలబెట్టారు. మేం తలుచుకుంటే వాళ్ల పరిస్థితి మరోలా ఉంటుంది. విజయం కోసం వైసీపీ నేతలు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలో చోటు చేసుకుంటే సహించబోం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.’ – భాష్యం ప్రవీణ్, కూటమి అభ్యర్థి
Also read
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?