*
*ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు.. సీనియర్ సిటిజన్ ఆవేదన*
*మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాలలో నత్తనడకన సాగుతున్నాయి*
*కుంచనపల్లి లో బూత్ నంబర్ 69 లో శివరామిరెడ్డి అనే సీనియర్ సిటిజన్.. నాలుగు గంటలు లైన్లో నుంచి నరకం అనుభవించాలని… తన ఆవేదనను దీక్ష మీడియాతో పంచుకున్నారు*
*పోలింగ్ రూమ్ లోనికి వెళ్లడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు… చిన్న డోర్ ముందు 8 సెపరేట్ లైన్లు ఉన్నాయని… అందరూ లోనికి వెళ్లడానికి పోటీలు పడ్డారని… వారి మధ్యలో నలిగిపోయానని బాధపడ్డారు.. తనకి నాలుగు గంటలు సమయం ఓటింగ్ వేయడానికి పట్టిందని… మంచినీళ్లు కూడా అందించలేదని బాధపడ్డారు*
*కొన్నిసార్లు పోలింగ్ యంత్రాలు కూడా మొరాయించాలని…అధికార యంత్రాంగం సమస్యలను చక్కదిద్దకపోతే.. ఓటింగ్ శాతం తగ్గి ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని అన్నారు.*
*తాను అనుభవించిన నరకాన్ని మరొకరు అనుభవించకూడదని మీడియా ముందుకు స్వచ్ఛందంగా వచ్చానని… ఈ వీడియో చూసి అన్న అధికారులు కళ్ళు తెరిచి… సరైన సదుపాయాలు… క్యూలైన్ కంట్రోల్ చేయడానికి తగు పోలీస్ సిబ్బందిని… ఏర్పాటు చేయాలని తెలియజేశారు.*
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





