July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

నాలుగు గంటలు నరకం అనుభవించా

*

*ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు.. సీనియర్ సిటిజన్ ఆవేదన*

*మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ అన్ని కేంద్రాలలో నత్తనడకన సాగుతున్నాయి*

*కుంచనపల్లి లో బూత్ నంబర్ 69 లో శివరామిరెడ్డి అనే సీనియర్ సిటిజన్.. నాలుగు గంటలు లైన్లో నుంచి నరకం అనుభవించాలని… తన ఆవేదనను దీక్ష మీడియాతో పంచుకున్నారు*

*పోలింగ్ రూమ్ లోనికి వెళ్లడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు… చిన్న డోర్ ముందు 8 సెపరేట్ లైన్లు ఉన్నాయని… అందరూ లోనికి వెళ్లడానికి పోటీలు పడ్డారని… వారి మధ్యలో నలిగిపోయానని బాధపడ్డారు.. తనకి నాలుగు గంటలు సమయం ఓటింగ్ వేయడానికి పట్టిందని… మంచినీళ్లు కూడా అందించలేదని బాధపడ్డారు*

*కొన్నిసార్లు పోలింగ్ యంత్రాలు కూడా మొరాయించాలని…అధికార యంత్రాంగం సమస్యలను చక్కదిద్దకపోతే.. ఓటింగ్ శాతం తగ్గి ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని అన్నారు.*

*తాను అనుభవించిన నరకాన్ని మరొకరు అనుభవించకూడదని మీడియా ముందుకు స్వచ్ఛందంగా వచ్చానని… ఈ వీడియో చూసి అన్న అధికారులు కళ్ళు తెరిచి… సరైన సదుపాయాలు… క్యూలైన్ కంట్రోల్ చేయడానికి  తగు పోలీస్ సిబ్బందిని… ఏర్పాటు చేయాలని తెలియజేశారు.*

Also read

Related posts

Share via