సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్తాకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
చిలమత్తూరు: సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్మెన్, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: మంత్రి సవిత
ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించరాని నేరం చేశారని తెలిపారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.
Also read
- జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది!
- Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
- పగలంతా ఇళ్లను గుర్తిస్తారు.. రాత్రిళ్లు దోచేస్తారు





