మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వనౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు.
హిందూపురం , : మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా.. రాజశేఖర్ గురువారం గ్రామంలోని వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారు. అనంతరం ఆయన తన పొలం వద్దకు వెళ్లి రాత్రి వస్తుండగా వైకాపా కార్యకర్తలు ఆటోతిమ్మ, లక్ష్మీనారాయణ, రామాంజప్ప, భరత్, జయప్ప, ఆదినారాయణలు అడ్డగించారు. మా వైకాపా జెండా దిమ్మెపై ఎలా కూర్చుంటావని వాగ్వాదానికి దిగి దుర్భాషలాడి దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు వన్లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- Diwali 2025: దీపావళి రోజున పాత ప్రమిదల్లో దీపాలు వెలిగించడం శుభమా? అశుభమా? నియమాలు తెలుసుకోండి..
- Astro Tips: ఈ రాశుల వారు వెండి ధరించారో బతుకు బస్టాండే.. తస్మాత్ జాగ్రత్త
- నేటి జాతకములు…16 అక్టోబర్, 2025
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత