మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వనౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు.
హిందూపురం , : మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా.. రాజశేఖర్ గురువారం గ్రామంలోని వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారు. అనంతరం ఆయన తన పొలం వద్దకు వెళ్లి రాత్రి వస్తుండగా వైకాపా కార్యకర్తలు ఆటోతిమ్మ, లక్ష్మీనారాయణ, రామాంజప్ప, భరత్, జయప్ప, ఆదినారాయణలు అడ్డగించారు. మా వైకాపా జెండా దిమ్మెపై ఎలా కూర్చుంటావని వాగ్వాదానికి దిగి దుర్భాషలాడి దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు వన్లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





