మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వనౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు.
హిందూపురం , : మోతుకపల్లిలో తెదేపా నాయకుడు రాజశేఖర్ వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారని అదే గ్రామానికి చెందిన ఆరుగురు వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాజగోపాలనాయుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా.. రాజశేఖర్ గురువారం గ్రామంలోని వైకాపా జెండా దిమ్మెపై కూర్చున్నారు. అనంతరం ఆయన తన పొలం వద్దకు వెళ్లి రాత్రి వస్తుండగా వైకాపా కార్యకర్తలు ఆటోతిమ్మ, లక్ష్మీనారాయణ, రామాంజప్ప, భరత్, జయప్ప, ఆదినారాయణలు అడ్డగించారు. మా వైకాపా జెండా దిమ్మెపై ఎలా కూర్చుంటావని వాగ్వాదానికి దిగి దుర్భాషలాడి దాడి చేశారు. ఈ విషయాన్ని బాధితుడు వన్లైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన వైకాపా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





