ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్యం జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది.
డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి ట్రాప్ చేసి నలుగురు యువకులను మోసగించింది. ఇప్పటికే ముగ్గురిని మోసం చేయగా.. తాజాగా మరో వ్యక్తిని మోసం చేయగా ఈ నిత్య పెళ్లికూతురు బాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ్య జిల్లా మద్దూరు జిల్లా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె వైష్ణవి, ఇదే జిల్లా మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన శశికాంత్ ఎనిమిది నెలలుగా ప్రేమించుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్నారు.
తాము చాలా పేదావాళ్లమంటూ
అయితే వివాహానికి ముందే తాము చాలా పేదావాళ్లమంటూ అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రాముల బంగారం కాజేసింది. 2025 మార్చి 24న ఆదిచుంచనగిరి క్ష్రేత్రంలో వీరి పెళ్లి జరగ్గా మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరె చాముండేశ్వరి ఆలయానికి కారులో బయల్దేరారు. అయితే ఉమ్మడిహళ్లి గెట్ వద్ద వాటర్ బాటిల్ కోసం శశికాంత్ కారు దిగగా.. అప్పటికే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి జంప్ అయింది.
శశికాంత్ వచ్చి చూసేసరికివైష్ణవి కనిపించకుండా పోవడంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని విచారణలో తెలిసింది. ధర్మస్థలలో హాసన్కు చెందిని రఘుతో మొదటి పెళ్లి, శివతో రెండో పెళ్లి, రఘతో మూడో పెళ్లి జరిగిందని.. ఇలా ముగ్గురిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బు, నగలతో పరార్ అయినట్లుగా కేసులు నమోదైనట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also read
- కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..
- Vizianagaram: ప్రశాంత జిల్లాను కలవరపాటుకు గురిచేసిన సిరాజ్ నేపద్యం ఏంటి?
- Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
- హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
- Hyderabad: పండుటాకులకు పెళ్లి సంబంధాలు చూస్తామని.. పళ్లాలు బోర్లించారు