రాయదుర్గం(అనంతపురం) : అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో నివసిస్తున్న పార్వతి, మోహన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుండేది. ఇది వరకు మహిళ కుమార్తె పేరిట రూ.రెండు లక్షల డిపాజిట్ ఉండేది. మోహన్ ఈ డబ్బులు కావాలని చెప్పి కుమార్తెను తీసుకెని వెళ్లాడు. రెండు లక్షల రూపాయలు ఇస్తేనే కూతుర్ని ఇస్తానంటూ పార్వతికి చెప్పాడు. తాను డబ్బులు ఇస్తానని, తర్వాత తమ జోళికి రాకూడదని అతనితో ఒప్పందం చేసుకున్నారు. ఇదే సమస్యపై గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పొదుపు సంఘం సమావేశానికి పార్వతి వెళుతుండగా మోహన్, అతని సోదరుడు సిద్ధులు ఆమెపై దాడి చేశారు. తమతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను పోసి, నిప్పంటించారు. స్థానికులు గుర్తించి ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే 60 శాతం శరీరం కాలిపోయినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ప్రభుత్వాసుపత్రికి వచ్చి పార్వతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎం. శ్రీనివాసులు తెలిపారు.
Also read
- చచ్చే వయసులో ఇదేం పోయేకాలం .. షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు.. చివరకు
- ఫామ్హౌస్లో వీకెండ్ పార్టీ.. తెల్లారి స్విమ్మింగ్ పూల్లో తేలిన టెకీ డెడ్ బాడీ..! మిస్టరీగా మరణం
- పోలీసుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది?
- పంచాంగంలో ఉన్న 5 అంగాల రహస్యం తెలుసా? వీటి ప్రభావం జీవితంపై ఎలా ఉంటుందంటే!
- దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర ఫలితాలపై శాస్త్రాల హెచ్చరిక!





