నల్లగొండ..కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్లో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని వాపోయారు. 400 మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థినిలు హెచ్చరించారు.
Also read
- May 2026 Horoscope: వారికి పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు.. మీ రాశి మాసఫలాలు
- ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు
- దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..
- మనుషుల మధ్య కక్ష.. బోరుకు తాళం! అల్లూరి జిల్లాలో నీటి చుక్కపై ఆధిపత్య పోరు
- రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..





