నల్లగొండ..కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. పురుగులన్నం, నీళ్ల చారు ఇదేంటని ప్రశ్నిస్తే మమ్మల్ని కుక్కలకన్నా దారుణంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్లో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఇదేంటని అడిగితే ప్రిన్సిపాల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందని వాపోయారు. 400 మంది విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థినిలు హెచ్చరించారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





