అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరి అనే ఓ యువతి గ్రౌండ్ లో కారు నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల పైకి ఎక్కించేసింది. అదుపు తప్పడంతో పిల్లల పైకి కారు వెళ్లింది. ఈ ఘటనలో పదేళ్ల మణివర్మ అనే బాలుడు స్పాట్లోనే చనిపోగా ఏకవాణి అనే పద్నాలుగేళ్ల పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కాతమ్ముడు మైదానంలో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పిల్లాడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే