ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
మునగాల, : ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని జీడిమెట్ల నుంచి సుమారు 30మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యానాంకు బయలుదేరింది. మార్గమధ్యంలో మునగాల ప్రభుత్వ వైద్యశాల వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా సర్వీస్ రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులోని నలుగురు క్షతగాత్రులను సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also read
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
- అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..





