కామారెడ్డి జిల్లాలో ఘటన
బీర్కూర్: బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీర్కూర్ మండలం వీరాపూర్నుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) ఉన్నారు. ప్రహ్లాద్ రోజూవారీ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని. వారిని ఏ విధంగా చదివించి, వివాహాలు చేయాలని బాధపడేవారు.
ప్రస్తుతం సౌందర్య 9 నెలల గర్భిణి. ఈ నెల 26 లోపు కాన్పు అవుతుందని వైద్యులు తెలిపారు. నాలుగో సంతానం కూడా కుమార్తె జన్మించొచ్చనే భయంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులు చూస్తుండగానే విష ద్రావకం తాగారు. కుటుంబీకులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఆదివారం మృతదేహానికి శవ పరీక్ష చేసి కుటుంబీకులకు అప్పగించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. కాగా ప్రహ్లాద్ గతంలోనూ మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబీకులు కాపాడారు.
Also read
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి




