ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పై చేయి చేసుకున్నాడు.
TG Crime: ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. హోటల్ సిబ్బందికి రాముకు మధ్య గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. దీంతో తల్లాడ నుంచి కల్లూరుకు భారీగా చేరుకున్న రాము అనుచరులు హల్చల్ చేశారు.
ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదరడంతో ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మహిలా ఎస్సై హరిత తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారు వినకపోవడంతో పాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయలు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు
కాగా గొడవ సద్దుమనగక పోవడంతో రామును స్టేషన్ కు తరలిస్తుండగా రాము అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. తీవ్ర అసహనంతో మహిళాఎస్సై హరిత రాముపై చేయి చేసుకుంది. దీంతో మరింత రెచ్చిపోయిన రాము మహిళా ఎస్సైని తోసేశాడు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోచుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాయలరాముతో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా రాము మహిళా ఎస్సై పై చేయి చేసుకోవడాన్ని పలువురు ఖండించారు.
Also read
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!