మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు,, భక్తుల శివనామ స్మరణల మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నారద పుష్కరిణి అలలపై ఉత్సవ మూర్తులు ఐదు ప్రదక్షిణల అనంతరం ధూప ,దీప, నైవేద్య కైంకర్యాలు చేపట్టారు. తెప్పోత్సవం తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలివచ్చారు
Also read
- మీపై కేసులు పెడతాం’ – ప్రేమజంటలను బెదిరించి దోచుకుంటున్న నకిలీ పోలీసులు
- AP Crime: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న
- అగ్నికి అహుతైన కూర్మగ్రామం..నిప్పు పెట్టిన దుండగులెవరో?
- Warangal: మహిళ మర్డర్ మిస్టరీ వీడింది.. చంపింది ఎవరో కాదు.. ఇంట్లో వ్యక్తే.. అసలేం జరిగిందంటే..
- ఆన్లైన్లో ట్యాబ్ ఆర్డర్ చేశారు.. కట్ చేస్తే, పార్శిల్ ఓపెన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్..