ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి.
చిత్తూరు, ఏప్రిల్ 19: ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గురువారం వైసీపీ అభ్యర్థి ద్వారాకనాథ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఆ సమయంలో పరిమితికి మించి ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. కానీ నిబంధనలు ప్రకారం అంత మంది ఉండకూడదంటూ.. పోలీసులు వారిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.
కానీ శుక్రవారం టీడీపీ అభ్యర్థి దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ క్రమంలో ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలోనికి భారీగా టీడీపీ శ్రేణులు చొచ్చుకు వచ్చాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జి చేశారు.
అయితే ఈ లాఠీచార్జి జరుగుతున్న సమయంలో ఆగంతకులు ఆ ప్రాంతలో రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ట్రైనీ డిఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. దాంతో కూటమి అభ్యర్థి టిడిపి నాయకుడు దాసరి జయచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి