అది శ్రీరాముని ఆలయం.. భక్తులంతా శ్రావణమాస పూజల్లో నిమగ్నమయ్యారు. పూజారి కూడా సీతారాములకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి. అందరూ ఉరుకులు.. పరుగులు తీశారు. హడావుడి మొదలైంది. కట్ చేస్తే.. అసలు విషయం తెలిసి, పూజారి సైతం పరుగు అందుకున్నారు. తీరా చూస్తే, నాగు పాము కలకలం రేపింది. భుసలు కొడుతూ హడలెత్తించింది. విశాఖ మల్కాపురం శ్రీరాముని ఆలయంలో భక్తుల హడావుడితో పడగ విప్పి హల్చల్ చేసింది ఆరడుగుల నాగు పాము. దీంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు.. చాకచక్యంగా పామును బంధించి, నగర శివారు లో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్చేస్తే..
- ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
- Telangana: పరీక్షలో ఫెయిలయ్యానని విద్యార్థిని సంచలన నిర్ణయం.. ఏం చేసిందంటే?
- Sri Veereswara Swamy Temple : మీకు పెళ్లి కావట్లేదా..? వెంటనే కోనసీమలో ఉన్న ఈ ఆలయంలో కళ్యాణం చేయించండి..
- జేబులో బోలెడంత డబ్బు.. ఈ మూడు రాశుల వారి ఇంట ధన వర్షమే!





