గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్స్లో సజీవ పురుగులు దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు హామీ ఇచ్చారు
Also read
- శ్రావణంలో 5 శుక్రవారాలు.. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేయాలి? శాస్త్రం చెప్పేది ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
- అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
- హైదరాబాద్ లో మహిళ అనుమానాస్పద మృతి..





