ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడా కూడా అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే చెక్పోస్టుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేని.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
AP News: ఓ కంటైనర్లో దొరికిన ఇనుప పెట్టెలు.. వాటిని తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడా కూడా అవాంచనీయ ఘటనలు జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే చెక్పోస్టుల వద్ద ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, బంగారం, వెండి ఆభరణాలు, అక్రమ మద్యం లాంటి వాటిని సీజ్ చేస్తున్నారు. ఇటీవల కోనసీమ జిల్లా కడియం మండలం పొట్టిలంక వద్ద ఎన్నికల తనిఖీల్లో పోలీసుల చెక్పోస్ట్ వద్ద బంగారు, వెండి ఆభరణాలను పట్టుకున్నారు. కంటైనర్లో రూ. 2.57 కోట్లు విలువైన 3.347 కేజీల బంగారం నగలు, అలాగే రూ. 1.07 లక్షల విలువైన 1.209 కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, పట్టుబడ్డ బంగారు, వెండి ఆభరణాల విలువ రూ. 2.58 కోట్లు కాగా.. ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కంటైనర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు అధికారులు. డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం సంబంధించిన శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే