మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆమె ఎక్కిన ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ తర్వాత డ్రైవర్ దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై డ్రైవర్ ఆటోలోనే అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయాడని తెలిపింది.
యువతి అమీర్పేటలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తుందని సమచారం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కాగా.. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!