మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలో జరిగింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీ పురంలో ఐటీ ఉద్యోగిని ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఆమె ఎక్కిన ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ తర్వాత డ్రైవర్ దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై డ్రైవర్ ఆటోలోనే అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.. అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పోయాడని తెలిపింది.
యువతి అమీర్పేటలోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేస్తుందని సమచారం.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కాగా.. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




