అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు.
అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది.. కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లిలోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. రైల్వే సిబ్బందికి పసికందు ఏడుపు వినిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. రామగుండం రైల్వే సీఐ సురేష్ గౌడ్ తన సిబ్బందితో వచ్చి శిశువును ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి, చికిత్స అందించారు. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం అందించి ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నారు.
పట్టాలపై శిశువును వదిలి వెళ్లిన వారికి కఠినమైన శిక్షలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నవ మాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి కూడా తన బిడ్డను వదులుకోవడాన్నిఎలా ఒప్పుకుందని.. ఇంత కర్కషత్వం ఎందుకని.. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇలాంటి వారి కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
అయితే.. పోలీసులు ఈ ఘటనపై కేసు
నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అధికారులు.. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో చిన్నారి ప్రాణం దక్కిందని పోలీసులు తెలిపారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!