ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను డెంగ్యూ జ్వరం వణికిస్తోంది. డెంగ్యూ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భాగపూర్ గ్రామానికి చెందిన బైరి శ్రీలత ఐదు రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మహిళ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
అటు, కుబీర్ మండలంలోని వర్ని గ్రామానికి చెందిన కొండిరాం అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్రమైన జరంతో బాధ పడుతున్నాడు. పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం బైంసాకు బయల్దేరాడు. ఈ క్రమంలోనే అలసి పోయి ఓ చోట చెట్టుకింద కూర్చున్నాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదిలా ఉంటే, పల్లెల్లో పరిశుభ్రతపై తక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. వీధులు, మురికి కాల్వ నిర్వహణ, రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లటంపై దృష్టి సారించారు. ప్రజలకు కూడ పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నుండి మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు. అలాగే, ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. సులభంగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన, తేలికపాటి భోజనం తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకూ కాచి, చల్లార్చిన నీటినే తరచూ తాగుతూ ఉండాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని చెప్పారు
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి