కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. ఈ షాకింగ్ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.
తన కూతురిని ఓ వీధి కుక్క కరిచిందనే కోపంతో ఓ వ్యక్తి ఆ కుక్కను అతి దారుణంగా చంపేశాడు. ఓ కుక్క ఓ బాలికను కరవడంతో ఆమె తండ్రి కుక్కపై అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పప్పు అనే వ్యక్తి కూతురిని ఓ వీధి కరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్లోని గుణాలో జరిగిన ఈ షాకింగ్ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.
జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పప్పు చేసిన దారుణానికి పోలీసులే షాక్ తిన్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై జంతు హింస కేసు నమోదు చేశారు.
విచారణ కొనసాగుతుండగా, స్థానిక జంతు హక్కుల కార్యకర్తలు నిరసనలను ప్లాన్ చేస్తున్నారు, కఠినమైన శిక్షలు మరియు జంతు క్రూరత్వం గురించి మరింత అవగాహన కోసం ఒత్తిడి చేస్తున్నారు
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





