రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఆకుల నాగచైతన్య అనే 15ఏళ్ల బాలిక ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. నాగచైతన్య చిన్నప్పటినుంచి చురుకైన విద్యార్థిని. చదువులో పదేపదే మెరిసిపోతూ గురువులకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచేది. ఉన్నట్టుండి ఏప్రిల్ 17న అనారోగ్యం ఆమెను మట్టిలో కలిపేసింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంకా ఆమె జ్ఞాపకాలతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అయితే, చైతన్య రాసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అందులో ఆమె 600కి 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్గా నిలిచింది. ఈ వార్త తెలియగానే ఆమె తల్లిదండ్రులు ఆకుల రవి, రజిత కన్నీటి పర్యంతమయ్యారు. కళ్ల ముందు లేని తమ కూతురు ఎంత గొప్పగా నిలిచిందో తెలుసుకుని వారి గుండె మరింత భారంతో నిండిపోయింది. “ఈ ఫలితాన్ని ఆమె కళ్లతో చూసి సంతోషించాల్సింది. కానీ దురదృష్టం మమ్మల్ని విడిచిపెట్టలేదు” అని చెబుతూ ఆ తల్లిదండ్రుల వేదన మాటల్లో వ్యక్తమవుతోంది.
నాగచైతన్య లేని లోటు ఎప్పటికీ తీరదు. కానీ ఆమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. పదవ ఫలితాలని చూసిన స్కూల్ లో ఉన్న ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, తోటి విద్యార్థిని, విద్యార్థులు వచ్చిన మార్కులను చూసి ఒక వైపు ఆనందం వ్యక్తం చేస్తునే.. మరోవైపు ఆమె జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నామని అన్నారు. ఈ మరణం తో.. కుటుంబం షాక్ లోకి వెళ్ళింది
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..