మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది..
మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని గాజులరామరంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు..
వీడియో చూడండి..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని.. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





