మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది..
మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని గాజులరామరంలో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు..
వీడియో చూడండి..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని.. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Andhra: అచ్చం గీతాగోవిందం మూవీ లాంటి సీన్ – ఈ విద్యార్థిని గురువుకు ఎలా పంగనామాలు పెట్టిందంటే
- Love Couple Suicide : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి…చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
- Crime News : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
- AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
- AP Crime : భార్యను కాపురానికి పంపలేదని అత్తను ఏసేసిన అల్లుడు