కామారెడ్డి నిజాంసాగర్ మండలోని చిన్న ఆరెప్పలికి చెందిన చెన్నబోయిన అనిల్ అనే వ్యక్తి శుక్రవారం జరిగిన బంధువుల వివహా వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పెళ్లి అయిన తర్వాత పెళ్లింటి బంధువులు సాయంత్రం బరత్ వేడుకను ఏర్పాటు చేశారు. బరాత్లో డ్యాన్స్ చేయాలి అనిల్ ఎంతో ఆశపడ్డాడు. అయితే అందుకు భార్య నిరాకరించింది.
డ్యాన్స్ చేయడం వద్దు అనేసరికి అనిల్ ఒక్కసారి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపైనా అనిల్ తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. కాసేపటికి అనిల్ ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. డ్యాన్స్ వద్దన్న కారణంగా మనస్థాపానికి గురైన అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే అనిల్కు మతి స్థిమితం సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతాయి
Also read
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?
- Andhra News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి!
- మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..