కామారెడ్డి నిజాంసాగర్ మండలోని చిన్న ఆరెప్పలికి చెందిన చెన్నబోయిన అనిల్ అనే వ్యక్తి శుక్రవారం జరిగిన బంధువుల వివహా వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పెళ్లి అయిన తర్వాత పెళ్లింటి బంధువులు సాయంత్రం బరత్ వేడుకను ఏర్పాటు చేశారు. బరాత్లో డ్యాన్స్ చేయాలి అనిల్ ఎంతో ఆశపడ్డాడు. అయితే అందుకు భార్య నిరాకరించింది.
డ్యాన్స్ చేయడం వద్దు అనేసరికి అనిల్ ఒక్కసారి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపైనా అనిల్ తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. కాసేపటికి అనిల్ ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. డ్యాన్స్ వద్దన్న కారణంగా మనస్థాపానికి గురైన అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే అనిల్కు మతి స్థిమితం సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతాయి
Also read
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?
- శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? స్త్రీలే ఎక్కువగా ఆచరించడం వెనుక అసలు పరమార్థం ఇదే!





