కామారెడ్డి నిజాంసాగర్ మండలోని చిన్న ఆరెప్పలికి చెందిన చెన్నబోయిన అనిల్ అనే వ్యక్తి శుక్రవారం జరిగిన బంధువుల వివహా వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్నం పెళ్లి అయిన తర్వాత పెళ్లింటి బంధువులు సాయంత్రం బరత్ వేడుకను ఏర్పాటు చేశారు. బరాత్లో డ్యాన్స్ చేయాలి అనిల్ ఎంతో ఆశపడ్డాడు. అయితే అందుకు భార్య నిరాకరించింది.
డ్యాన్స్ చేయడం వద్దు అనేసరికి అనిల్ ఒక్కసారి మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపైనా అనిల్ తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. కాసేపటికి అనిల్ ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. డ్యాన్స్ వద్దన్న కారణంగా మనస్థాపానికి గురైన అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే అనిల్కు మతి స్థిమితం సరిగ్గా ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతాయి
Also read
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అబద్ధం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు పడతాయయో తెలిస్తే వెన్ను వణకాల్సిందే..
- SSC వాల్యుయేషన్లో బయటపడ్డ తీవ్ర లోపాలు.. ఐదుగురు వాల్యుయేటర్లు సస్పెండ్!
- Andhra: ఏపీ MLC కారు మిస్సింగ్.. నిందితుడ్ని పట్టేసిన పోలీసులు.. అతని చెప్పింది విని షాక్
- నడిపేది రోడ్డు సైడ్ డాబా హోటల్ అనుకునేరు.. లోపల యవ్వారం చూస్తే సీన్ సితారే
- తాగి మైకంలో రెచ్చిపోయిన కానిస్టేబుల్.. బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ!