జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు వరుడు కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సందడి మధ్య ఈ ఘటన కుటుంబ సభ్యులను, బంధువులను కన్నీళ్లలో ముంచెత్తింది. కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అనాలోచితంగానో లేక క్షణికావేశంలోనూ కొంతమంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి తీసుకునే ఆ నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఎలాంటి టైమ్లో తెలిస్తే అయ్యో పాపం అంటారు. ఆ ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంది, ఎందుకంటే.. తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి. తమ కుమారుడికి పెళ్లి అవుతుందనే సంతోషంలో ఆ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. చుట్టాలంతా రావడంతో ఇళ్లంతా ఎంతో సందడిగా ఉంది. అప్పటికే పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి. ఈ రాత్రి గడిస్తే రేపు మంగళవాయిద్యాల మధ్య నూతన జంట ఒక్కటి కానుంది. కానీ, అంతలోనే ఆ పెళ్లి కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
పెళ్లికి ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రంపేటలో చోటు చేసుకుంది. మృతుడి పేరు కిరణ్. తెల్లారితే పెళ్లి పెట్టుకొని ఇంత కఠిన నిర్ణయం తీసుకొని, తనవు చాలించాడు. పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీటలు ఎక్కుతాడనుకున్న కుమారుడు, శవమై పాడెక్కుతుంటే ఆ కన్నవాళ్లు గుండెలు పగిలేలా విలపించారు. పెళ్లి చూద్దామని వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కిరణ్ ఆత్మహత్యతో మరోవైపు వధువు ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
Also read
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





