అప్పు చేయకండి.. తప్పు చేయకండి అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ వాటిని ఎవరు పట్టించుకోరు. పెడచెవిన పెడుతూ ఉంటారు. అప్పు తీసుకొని కట్టలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఒకనొక దశలో ఆ అప్పులు తీర్చలేక కుటుంబంతో పాటే ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి ఘటనే ఒక్కటి నిజామాబాద్లో చోటుచేసుకుంది.
అప్పులు ఇచ్చిన వారి వేధింపులకు మరో కుటుంబం బలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చిన్న వ్యాపారం చేసుకునే ఓ కుటుంబం అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు కుటుంబసభ్యులు బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి కూతురు గోదావరి నీటిలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం అక్కడ ఉన్న స్థానికులు కాపాడి గోదావరి ఒడ్డుకు తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్లో నివాసం ఉంటున్న ఉప్పలించి వేణు..భార్య అనురాధ..కూతురు పూర్ణిమ. గంజి మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తులు రోషన్ , వికాస్ల దగ్గర సుమారు రూ.3 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు.. గంజి వ్యాపారులు చక్రవడ్డీ వేసి అప్పు కట్టమని లేకుంటే మీ సంగతి తెలుస్తామని వేధించడంతో బుధవారం ఉదయం బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





