పవిత్ర పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి క్షేత్రం పరిసరాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ప్రధాన గుడి వెనుక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇది భక్తులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ క్షుద్ర పూజలు ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి గుడి వెనక వైపు హనుమాన్ టెంపుల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. గుడి ముందు ప్రధాన రహదారిపై నల్లకోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన సామాగ్రిని రహదారి పైన వదిలి వెళ్లారు.. ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు నల్లకోడిని బలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పుణ్య క్షేత్రంలో ఎవరు క్షుద్రపూజలు నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Also read
- Lord Shani: శత్రువెవరో మిత్రులెవరో తెలుస్తుంది..! శని దోషం కూడా వీరికి ఒక వరమే!
- Garuda Purana: కాకి పిండం తింటే పితృ దేవతలకు చేరినట్టేనా..? అసలు గరుడ పురాణం ఏం చెప్తుంది
- Vijayawada Accident: ఒక చేత్తో సెల్ఫోన్.. మరో చేత్తో డ్రైవింగ్.. అదుపుతప్పి కిందపడ్డ యువతి
- సంగారెడ్డిలో కిడ్నాప్ గ్యాంగ్ హల్చల్.. ఐదుగురు పిల్లలను..
- బాలికతో అసభ్య ప్రవర్తన కేసు.. హెడ్ కానిస్టేబుల్ కు పదేళ్ల జైలుశిక్ష





