SGSTV NEWS
CrimeTechnology

అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన వ్యక్తులు.. పాపం డోరు తెరిచిన వృద్ధురాలు.. ఇంతలోనే..!



నేటి రోజుల్లో అపరిచిత వ్యక్తులకు ఉపకారం చేస్తే అపకారం ఎదురవు తుందని మన పెద్దలు చెబుతుంటారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని ఇంట్లోకి రాని వద్దని పోలీసులు తరచూ హెచ్చరిస్తుంటారు. మండుటెండలో వచ్చి కాసిన్నీ మంచినీళ్లు కావాలని అడిగారు. అయ్యో బిడ్డా అంటూ మంచినీళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసిందా వృద్ధురాలు. అయ్యో పాపం అన్నందుకు ఆ వృద్ధురాలీకి ఏం జరిగిందో తెలుసా..?

ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్‌గా చేసుకుని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. ఆపై దాడులు చేసి చోరీలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వీటీ కాలనీలో నాగులంచ లక్ష్మమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. మధ్యాహ్నం వేళ ఇద్దరు దుండగులు ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు. అయితే తమ ఇంట్లో అద్దెకు రూమ్‌లు లేవని లక్ష్మమ్మ చెప్పింది. ఆమెను మాటల్లో పెట్టిన దుండగులు.. మండుటెండకు దాహం వేస్తోందనీ.. కాసిన్ని మంచినీళ్లు కావాలని అడిగారు. అయ్యో బిడ్డా అంటూ వారికి మంచినీళ్లు ఇచ్చేందుకు లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్ళింది. ఆమెను అనుసరించిన దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశారు. లక్ష్మమ్మ భయంతో కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మొహంపై పిడుగుద్దులు గుద్దారు. వృద్ధురాలిని ఒక గదిలో తాళ్లతో బంధించారు. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు, చేతులకు ఉన్న వెండి గాజులు లాక్కోని పరారయ్యారు.

పది నిమిషాల తర్వాత తేరుకున్న లక్ష్మమ్మ చేతి కట్లు విప్పుకుని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దుండగుల కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శివరాం రెడ్డి చెప్పారు

Also read

Related posts

Share this