కడప జిల్లా బద్వేల్ లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్బాషా 4వతరగతి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
AP Crime : టీచర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్ లోని లిటిల్ ప్లవర్ పాఠశాలలో జరిగింది
పోలీసుల కథనం మేరకు.. లిటిల్ ప్లవర్ పాఠశాలలో ఉపాధ్యాయుడు అన్వర్బాషా కొంత కాలంగా నాల్గవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసింది. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని చితక బాదారు. దీంతో పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడ్ని స్టేషన్కు తరలించి, విచారణ చేపడుతున్నారు.
అన్వర్ నాల్గవతరగతి విద్యార్థినిని తరగతి గదిలోకి తీసుకెళ్లి ప్రయివేట్ పార్ట్స్పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పుకుంది.దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థిని బంధువులు, ఇరుగుపొరుగువారు అన్వర్ బాషాపై దాడి చేశారు. దీంతో పాఠశాలలో గందరగోళం నెలకొంది . విషయం తెలిసిన పోలీసులు పాఠశాలకు చేరుకుని అన్వర్ను స్టేషన్కు తరలించారుబాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కీచక ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 19 జూన్, 2026
- మదనపల్లిలో నివ్వేర పరుస్తున్న పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
- విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం
- రోడ్డు పక్కన అర్థరాత్రి కారులో ముగ్గురు వ్యక్తులు.. వచ్చి పోయే వాహనాలను ఆపి..
- Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ ఘటన.. మోహన్ లాల్ పై కేసు!





