పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
బెల్లంకొండ, : పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తరపున ఆయన సోదరి రుద్రమ్మదేవి ఆదివారం సాయంత్రం నాగిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా కార్యకర్తలు, నాయకులు ఆమె నిర్వహించిన ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుగా ఉంచి తెదేపా శ్రేణులను నిలువరించారు. దీంతో తెదేపా నాయకులు ప్రశ్నించగా వారిపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకొని తెదేపా శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి తెదేపా నాయకులకు సమాచారం అందించేలోపే అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనపై తెదేపానాయకులు ఎస్సై రాజేష్ కు ఫిర్యాదు చేశారు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!