అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలో దుండగులు
దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
శనివారం ఉదయం నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ తెదేపా శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు.
Also read
- Hyderabad : గొర్రెలకు కాపలగా పడుకున్న కానిస్టేబుల్….కత్తులతో దాడిచేసి 70 గొర్రెలతో పరారీ
- హైదరాబాద్ లో దారుణం…బ్యాంక్ లిప్టులో మర్డర్
- Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..?
- AP News : స్కూల్ పక్కనే మత్తుమందు అమ్మకం.. బానిసగా మారిన స్టూడెంట్ సూసైడ్
- నేటి జాతకములు 29 ఏప్రిల్, 2025